Thursday, May 9, 2024

కులాల మధ్య చిచ్చుకు బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -
Rakesh Tikait Says BJP conspiring to flare caste-based riots
రాకేష్ తికాయత్ ఆరోపణ

ఘజియాబాద్: కులాల మధ్య ఘర్షణలు సృష్టించడానికి బిజెపి కుట్ర పన్నిందని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) అధ్యక్షుడు రాకేష్ తికాయత్ ఆరోపించారు. బుధవారం ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఘాజీపూర్ వద్ద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్న రైతులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రైతు నాయకులకు నల్ల జెండాలు చూపించడంతో పాటు వారిని బిజెపి కార్యకర్తలు దూషించారని ఒక ప్రకటనలో తికాయత్ ఆరోపించారు. ఇదిలాఉండగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు సాగిస్తున్న రైతులకు బాల్మీకీ సమాజ్‌కు చెందిన కొందరు సభ్యులు మద్దతు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News