Saturday, April 27, 2024

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో #RC17

- Advertisement -
- Advertisement -

రంగా రంగా రంగస్థలాన… అంటూ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ‘రంగస్థలం’ సినిమా కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రకటన వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మేవరిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ అత్యంత భారీగా ‘ఆర్‌సి 17’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాయి. రామ్‌చరణ్ కెరీర్‌లోనే గుర్తుండిపోయే సినిమాగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు సుకుమార్. బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చరణ్.

ఇటు ‘పుష్ప’ సినిమాతో తగ్గేదేలే అంటూ అందరివాడనిపించుకున్నారు మూవీ మాస్టర్ సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద మన దగ్గరే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. వాటన్నింటినీ అందుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సుకుమార్. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారు. 2025 చివరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్‌కి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పేరు తోడవడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. రంగస్థలం బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News