Saturday, April 27, 2024

నార్సింగీలో అడ్వకేట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నార్సింగీ: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల్ గూడ లో ముఖర్జీ అనే అడ్వకేట్ ఆత్మహత్య చేసుకున్నారు. తన గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని అడ్వకేట్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా భర్తకు ముఖర్జీ భార్య దూరంగా ఉంటున్నారు. నార్సింగీ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Also Read: గాంధీభవన్‌లో మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News