Monday, April 29, 2024

రంగారెడ్డి, ఖమ్మం జట్లకు ఖోఖో టైటిల్స్

- Advertisement -
- Advertisement -

Rangareddy and Khammam emerged winners in Khokho

 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఖోఖో జూనియర్ పోటీల్లో రంగారెడ్డి, ఖమ్మం జట్లు విజేతగా నిలిచాయి. వరంగల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పోటీ పడ్డాయి. బాలికల విభాగంలో రంగారెడ్డి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో రంగారెడ్డి 107 తేడాతో నిజామాబాద్ జట్టును ఓడించింది. ఖమ్మంకు మూడో స్థానం లభించింది. ఇక బాలుర విభాగంలో ఖమ్మం విజేతగా నిలిచింది. ఫైనల్లో ఖమ్మం 128 తేడాతో వరంగల్‌ను ఓడించి టైటిల్‌ను సాధించింది. రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం దక్కింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News