ఆదివారం మినహా వ్యాపారాలకు అనుమతి
తిరువనంతపురం: కేరళలో లాక్డౌన్ నిబంధనలను సడలించారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులపాటు పరిశ్రమలు, కార్యాలయాలు, మార్కెట్లు, బ్యాంకులు, దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ సడలింపులు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు తెరిచేందుకు మాత్రం అనుమతించలేదు. మాల్స్కు ఆన్లైన్ డెలివరీకి అనుమతిచ్చారు. దీర్ఘకాలంపాటు ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందన్న నిపుణుల సూచనమేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకనటలో పేర్కొన్నది. వ్యాక్సినేషన్ను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా సామాజిక రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసి కొవిడ్19కు అడ్డుకట్ట వేస్తామని ఇప్పటికే ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జి ప్రకటించడం గమనార్హం. ఇటీవల దేశంలోకెల్లా కేరళలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.