Saturday, April 27, 2024

బాబాయ్, అబ్బాయి కాంబినేషన్‌లో రీమేక్ మూవీ

- Advertisement -
- Advertisement -

Remake movie in Venkatesh Rana combination

 

మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య రీమేక్ సినిమాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. సౌత్‌లోనే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ మల్టీ స్టారర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది మలయాళంలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’. ఈ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అంత ఇద్దరు వ్యక్తుల ఇగోలపై నడుస్తుంది. ఒక రిటైర్డ్ హవాల్దారు, ఒక పోలీస్ ఆఫీసర్‌కి మధ్య ఈ సినిమా కథ సాగుతుంది. బలమైన పాత్ర చిత్రణతో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సాచి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

చివరగా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హవాల్దారు పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. ఇక మరో కీలక బిజూ మీనన్ పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ముందుకు రాకపోవటంతో ఆ పాత్రకోసం విక్టరీ వెంకటేష్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక ఈ సినిమా చేయడానికి వెంకీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమాను డి.సురేష్‌బాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇక నటీనటులు అంతా సెట్ అయితే లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం మాత్రం ఇంకా కొంతకాలం ఎదురుచూడాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News