- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో కరోనా ఆంక్షలు విధిస్తూ సిఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోకి సాధారణ సందర్శకులకు అనుమతి నిషేధించారు. తాత్కాలిక పాసులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత అధికారి అనుమతి ఉంటేనే సందర్శకులకు అనుమతిస్తారని సోమేష్ కుమార్ వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే సదురు సందర్శకులకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
Restrictions on Secretariat Due to Covid-19
- Advertisement -