Saturday, April 27, 2024

తాలిబన్ల తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారు….

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి విషం కక్కుతున్నారు
దొంగల ముఠాకు సర్ధార్‌గా మారారు
ఆయన పదవుపై తప్ప… ప్రజల మీద అభిమానం లేదు
రేవంత్‌పై నిప్పులు చెరిగిన గులాబీ నేతలు

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబండ్ల తరహాలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయన విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌కు పదవులపై తప్ప… ప్రజల మీద ఏ మాత్రం అభిమానం లేదన్నారు.- రేవంత్ తన ఊర్లో దళితులను ఎప్పుడైనా గౌరవించారా? అని ప్రశ్నించారు. గురువారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ,కెపి వివేకానంద, ఎంఎల్‌సి శంభీపూర్‌రాజు మాట్లాడుతూ, రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రేవంత్ రెడ్డి ఏకైక లక్ష్యం కావడమేనన్నారు. ఇందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికేనా సిద్దంగా ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కావాలంటే విమర్శలు కాదు- …ప్రజల మనసులు గెలుచుకోవాలని సూచించారు. అంతే తప్ప ఛాందస వాదిగా మాట్లాడడం తగదన్నారు. ఏ మాత్రం అవగాహన,- ఆలోచన లేని వ్యక్తి రేవంత్ అని అన్నారు. ఆయన లాగా తిట్లపురాణం మాకు వచ్చు అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని అన్నారు. ఆయన ఏమైనా వామన అవతారుడా? లేక ఏమైనా మూడు కాళ్ళు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

తన పదవికి ఉన్న హుందా తనాన్ని మరిచి రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. దళిత గిరిజనుల వెనుకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. అణగారిన వర్గాలను ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదని రంగారెడ్డి జిల్లా అమరుడు యాదవరెడ్డి సోనియమ్మ సాక్షిగా ఢిల్లీలో ఆత్మబలిదానం చేసుకున్నారు. ఆయనను రేవంత్ ఎందుకు పరామర్శించలేదన్నారు.

రేవంత్‌రెడ్డి చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. వారు ప్రజాస్వామ్య హంతకులని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారిద్దరు కలిసి కుట్ర చేసింది నిజం కాదా? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌లో డిపాజిట్లు తెచ్చుకుని మాట్లాడాలని సవాల్ విసిరారు. పిసిసి పదవి రాగానే కొమ్ములు వచ్చాయనే విధంగా వ్యవహరించడం మంచిది కాదని సూచించారు. ప్రభుత్వంలో పాలనాపరమైన తప్పులు ఉంటే సూచనలు చెయ్యాలే కానీ ఇష్టమొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు. ఒక పిచ్చికుక్క…- కంచరగాడిదలాగా మాట్లాడితే తగు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఆయన దొంగల ముఠాకు సర్ధార్‌గా మారారన్నారు. త్వరలోనే రేవంత్‌ను రాళ్లతో కొట్టి బయటకు పంపుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News