హైదరాబాద్: కరోనా కారణంగా లాక్డౌన్ సమయంలో చిత్రీకరణ వాయిదా పడిన సినిమాలను పూర్తి చేసేందుకే దర్శకులు భయపడిపోతుంటే.. నా రూటే సపరేట్ అంటూ సినిమాల మీద సినిమాలు తీస్తూ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా సినిమాలను విడుదల చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వివాదాస్పద డైరెక్టర్ లాక్ డౌన్ సమయంలో ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను విడుదల చేశాడు. నిజ సంఘటనల నేపథ్యంలో రూపొందిస్తున్న మర్డర్ చిత్రం ట్రైలర్ ను రీసెంట్గా విడుదల చేశాడు. దీంతోపాటు వర్మ థ్రిల్లర్ అనే మరో మూవీని చేస్తున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ మూవీలో అప్సర రాణి, రాక్ కచ్చి జంటగా నటిస్తున్నారు. ఇందులో అప్సర రాణి తన హాట్ అందాలతో రెచ్చిపోనుంది. ఇటీవల అప్సర ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్పురి, గుజరాతి, ఒడియా భాషల్లో థ్రిల్లర్ ట్రైలర్ విడుదల చేశారు.
RGV’s THRILLER Movie Trailer Launch