Sunday, May 5, 2024

పంత్‌పై విమర్శల వర్షం

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తేలిపోయాడు. తేలికైన క్యాచ్‌లను జారవిడవడంతో సోషల్ మీడియా వేదికగా పంత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా యువ ఓపెనర్ పకోస్కి ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను పంత్ పట్టుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న పకోస్కి అర్ధ సెంచరీతో అలరించాడు. అంతేగాక లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌లను కూడా పంత్ పట్టుకోలేకపోయాడు. అతను కూడా అజేయ అర్ధ శతకంతో భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. పేలవమైన కీపింగ్‌తో నిరాశ పరిచిన పంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అతన్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారో అంతుబట్టడం లేదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ లేమితో బాధపడుతున్న పంత్‌కు వికెట్ కీపింగ్ సాధ్యం కాదని, టెస్టు వంటి సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనికి ఈ బాధ్యతలు అప్పగించడం పెద్ద పొరపాటని వారు విమర్శిస్తున్నారు.

Rishabh Pant gets trolled after dropping catches

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News