Monday, May 6, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి… కారు యజమానిపై దాడి

- Advertisement -
- Advertisement -

ముడుపుగల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముడుపుగల్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. దంతతులు వెళ్తున్న బైకును వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.

దీంతో ఆస్పత్రి వద్ద బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. కారు యజమాని, అతని బంధువును బాధితుల బంధువులు చితకబాదారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు యజమాని, బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Also Read : గుజరాత్‌లో బిపర్‌జాయ్ బీభత్సం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News