Monday, April 29, 2024

పెట్టుబడుల కోసం జెడ్డాలో రోడ్‌ షో

- Advertisement -
- Advertisement -

ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరిట నేడు నిర్వహణ
పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన సాగుతోంది. దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల కోసం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కదుర్చుకున్న విషయం విధితమే. దానికి కొనసాగింపుగా మరిన్ని పెట్టుబడులను ఆకర్శించడానికి మంత్రి శ్రీధర్ బాబు సౌదీ అరేబియా దేశంలో పర్యటిస్తున్నారు.

జెడ్డాలో ఆదివారం నాడు ఉదయం 9 గంట ల నుంచి 10 గంటల వరకు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు జెడ్డా ఛాంబర్స్ తో భేటీ జరుగుతుంది. అనంతరం ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఒంటిగంట వరకు సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో భేటీ అవుతారు.

ఆ తర్వాత పట్రోమిన్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఆ సంస్థ ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులుపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బట్టర్జీ హోల్డింగ్ కంపోనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతో సమావేశమవుతారు. అరాంకో సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు షెరటన్ హోటల్ లో జరిగే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సమావేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గానూ ఉన్న అనువైన సానుకూల వాతావరణం గురించి మంత్రి శ్రీధర్ బాబు వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రోత్సాహకా లు, ఇతర సహాయ సహకారాల గురించి అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చలు జరుపుతారు. మంత్రి శ్రీధర్ బాబు వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్, ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News