హైదరాబాద్: పట్టపగలు బ్యాంక్ మేనేజర్ను కత్తితో బెదిరించి దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25వ తేదీన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని ఫిలింనగర్లోని అపర్ణా ఆరా అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న కృష్ణవేణి శర్మ చిరాగ్ అలీ లేన్లోని పంజాబ్ నేషన్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తోంది. ఈ నెల వ25వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉంటున్న బ్యాంక్ ఖాతా దారుడిని కలిసేందుకు బయలుదేరింది. ఆటోలో వచ్చిన కృష్ణవేణి కమాండ్ కంట్రోల్ వద్ద దిగింది. అర్బర్ సూపర్ మార్కెట్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తుండగా హోండా యాక్టివా బైక్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో బెదిరించి ఆమె బ్యాగును లాక్కుని పారిపోయారు. బ్యాగులో రూ.10,000 నగదు, వివిధ బ్యాంకుల కార్డులు, పత్రాలు ఉన్నాయి. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
బ్యాంక్ మేనేజర్ను దోచుకున్న దుండగులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -