Saturday, April 27, 2024

ఫ్రెంచ్ కంపెనీలకు ప్రత్యేక క్లస్టర్‌లు

- Advertisement -
- Advertisement -

Specialized clusters for French companies:KTR

తెలంగాణలో అభివృద్ధి చేయడానికి ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ సెనెట్ ప్రసంగంలో మంత్రి కెటిఆర్ హామీ

టిఎస్‌ఐఐసిలో దాదాపు 2వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉంది
ఇందులో విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి
భారత్‌లో పెట్టుబడులు పెట్టదలిచే ఏ కంపెనీకైనా ఇతర రాష్ట్రాలలో లేని సౌకర్యాలను కల్పిస్తోంది

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఫ్రెంచ్ కంపెనీలకు, ముఖ్యంగా ఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు హామీనిచ్చారు. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరమ్‌లో మంత్రి కెటిఆర్ కీలకోపన్యాసం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కాన్ఫరెన్స్‌లో ‘కొవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం’ అనే అంశం మీద మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును కెటిఆర్ సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రా మికవేత్తలకు ఈ సందర్భంగా ఆయన ఆహ్వా నం పలికారు.

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడే ళ్లలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రి కెటిఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబ డిదారుల అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సెనేట్ వేదికగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషిం చాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. అనంతరం ఫోర మ్‌లో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఐపాస్ గురించి వివరిస్తూ, దేశంలోనే తెలం గాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రమన్నారు. రా ష్ట్ర ప్రభుత్వ టిఎస్ పాలసీ పారదర్శ కతతో కూడిన స్వీయ-ధృవీకరణను అనుమ తిస్తుందన్నారు. టిఎస్ ఐపాస్ చట్టం ప్రకా రం 15 రోజుల్లో అన్ని రకాల అనుమతుల కు సంబంధించి పూర్తి క్లియరెన్స్ లభిస్తుంద న్నారు. నిర్ణిత వ్యవధిలో వ్యవధిలో అనుమ తుల జారీ జారీకాని పక్షంలో 16వ రోజున పూర్తి అనుమతులు లభించి ఆమోదించబడి నట్లు భావించబడుతుందన్నారు.

తెలంగాణకు టిఎస్‌ఐఐసిలో దాదాపు 200 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందని మంత్రి కెటిఆర్ వివరించారు. ఇందులో విద్యుత్, నీరు మరియు ఉత్తమ మౌలిక సౌకర్యాలను కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను మంత్రి కెటిఆర్, హైలైట్ చేస్తూ ప్రభుత్వం తన సొం త ఖర్చులతో శిక్షణనిస్తుందన్నారు. వారిని నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తుం దన్నారు. ఇది స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ఏ కంపెనీ అయినా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఇతర రాష్ట్రా లు ఆఫర్ చేస్తున్న అంశాలను ప్రస్తావించగ లిగితే తాము వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆఫర్‌ను అందుకుంటామన్నారు. లేదా వారి ఆఫర్‌ను బీట్ చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు మంత్రి కెటి ఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ విధానా లు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాల భూమి కేటా యింపు, ఆమోదం,అనుమతులు అందించ డం, శిక్షణ పొందిన మానవ వనరులను పొంద డంలో కంపెనీలకు సహాయం చేయ డం, వనరుల సేకరణ విధానాలు వంటి బ హుళ కార్యాచరణ అంశాలలో గణనీయమై న స్వ యంప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నా యని కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News