- Advertisement -
మందుస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. జనవరి మాసంలో ఆమెకు జైలు నుంచి విముక్తి కలగనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇది తమిళ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. హఠాత్తుగా కర్నాటక హైకోర్టు ముందస్తు బెయిల్ ను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె శిబిరం డీలా పడిపోయింది. కొన్ని రోజుల క్రితమే తన శిక్షా కాలాన్ని తగ్గించాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును పరప్పన అగ్రహార జైలు అధికారులు ఉన్నతాధికారులకు కూడా పంపించారు.
- Advertisement -