Sunday, April 28, 2024

కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకు హైకోర్టు రూ .10 వేలు జరిమానా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు 2022 లో నమోదైన కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ ఈ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాతోపాటు మంత్రులు, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి ఉన్నారు. అలాగే మార్చి 6న ఎంపీ/ఎమ్‌ఎల్‌ఎ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

గత బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన గ్రామంలో పనులకు 40 శాతం కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది. ఆ సమయంలో అప్పటి సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అప్పటి సిఎం బసవరాజ్ బొమ్మై నివాసాన్ని ముట్టడించడానికి సిద్ధరామయ్యతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మార్చ్ చేపట్టారు.

రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును కొట్టేయాలన్న సిఎం సిద్ధ రామయ్య అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News