Saturday, April 27, 2024

ఆస్ట్రేలియా లో “నోముల”కు ఘన నివాళి…

- Advertisement -
- Advertisement -

Solid tribute to Nomula Narasimhaiah in Australia

 

పార్టీలకతీతంగా పాల్గొన్న తెలంగాణ బిడ్డలు…

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన నాగార్జున సాగర్ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్యకు ఆస్ట్రేలయాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్ బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్ లోని ప్రవాస తెలంగాణ సంఘాలు, వివిధ పార్టీ ల నాయకులు, ప్రజలు ఘన నివాళి అర్పించారు.

టిఅర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “ఉద్యమనేత, బడుగు బలహీనవర్గాల బలం, పేదవారి ఊపిరి, నాగార్జునసాగర్ ఎన్నికలలో గులాబి జెండా గౌరవాన్ని పెంచిన రాజికీయ దురంధరుడు, విప్లవ యోధుడు… ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించి, తన ప్రాణాలను సైతం వారి సేవకే అర్పించిన ఈ కాలం అరుదైన నాయకుడు, దివంగత నేత నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోమల నరసింహయ్యగారిని కోల్పోవడం ఇటు టాఅర్ఎస్ పార్టీకి, అటు తెలంగాణ సమాజానికి ఎంతో నష్టమని” తెలిపారు. ఇక్కడి సంఘాల నాయకులు పలువురు ఆయనతో తమ పరిచయాలను, అనుభవాలను, ఆయన చేసిన సేవలను కొనియాడారు మరియు ఆయన ఆశయాలను ముందుకు తీసుకొనివెళ్ళే దిశగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెప్పడం శ్లాఘనీయం .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మంజు, మోనికా, బ్రిందా, అవంతి, సతీష్, రమేష్, శ్రీధర్, ప్రేమ్, రవి, భార్గవ్, వీరేందర్ ఎస్, సంజయ్, రాజ వర్ధన్ రెడ్డి, చందూ, రుద్ర మరియు ఇతర ప్రవాస తెలుగు సంఘాల, పార్టీ ల సభ్యులు పాల్లోన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News