Monday, April 29, 2024

హిమాచల్ లో బీభత్సం

- Advertisement -
- Advertisement -

కులూ: హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక విడిది కులూ అని ప్రాంతంలో గురువారం భారీ స్థాయి కొండచరియలు విరిగిపడి భవనాలు నేలమట్టం అయ్యాయి. వీడని భారీ వర్షాల నడుమ పగపట్టినట్లుగా విరిగిపడుతున్న కొండలు గుట్టలు ఈ ప్రాంతంలో భారీ విధ్వంసానికి దారితీశాయి. గురువారం ఒక్కరోజే ఇక్కడ పై నున్న గుట్టలు పడటంతో కనీనం ఎనిమిది నివాసిత భవనాలు కుప్పకూలాయి. ముందస్తు జాగ్రత్త చర్యలతో ఈ భవనాలలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఓ భారీ స్థాయి వాణిజ్య భవనంపై కొండచరియలు విరిగిపడ్డప్పుడు భారీ పేలుళ్లస్థాయిలో చప్పుళ్లతో ఇది నేలమట్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News