Monday, May 6, 2024

బాలికను రక్షించేందుకు వెళ్లి బావిలో పడ్డ 15 మంది

- Advertisement -
- Advertisement -

Several people fell into a well during rescue of a girl

మధ్యప్రదేశ్‌లో ఘటన

విదిష: మధ్యప్రదేశ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో బాలికను రక్షించేందుకు వెళ్లి 15 మంది గోడ కూలి బావిలో పడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలోనే ఉండి సహయ చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. మంత్రి విశ్వాస్ సారంగ్‌ను ఘటనస్థలికి వెళ్లాలని ఆదేశించినట్లు సీఎం పేర్కొన్నారు. గంజ్‌బసోడ గ్రామం లో ఓ బాలిక బావిలో పడింది. దీంతో గ్రామస్థులు బాలికను రక్షించేందుకు బావిగోడ దగ్గర భారీగా గుమిగూడారు. దీంతో బావిగోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 15 మంది గ్రామస్థులు బావిలో పడ్డారు. కొందరు గాయాలతో బయటపడ్డారు.

Several people fell into well during rescue of girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News