Thursday, May 9, 2024

షకీబ్ టీమ్‌కు ధోని కెప్టెన్..

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, పాక్ మాజీ ఆటగాడు సయ్యద్ అన్వర్‌కి ఓపెనర్లుగా చోటిచ్చాడు. వెస్టిండీస్ విధ్వంస ఆటగాడు క్రిస్ గేల్ బ్యాట్స్‌మెన్‌గా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా షకీబ్ ఎంచుకున్నాడు.

షకీబ్ టైమ్ ఎలెవన్ జట్టు: సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జాక్వస్ కలీస్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్.

Shakib Al hasan announced his ODI XI Team

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News