Wednesday, May 1, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో ‘శ్యామ్ సింగ రాయ్’ బృందం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బాగంగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జిఎచెంసి పార్క్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇది మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమం అనంతరం గ్రీన్ఇండియా చాలెంజ్ కరుణాకర్ రెడ్డి, రాఘవ వృకవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు. ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు.

‘Shyam Singha Roy’ Movie Team plant saplings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News