Saturday, April 27, 2024

ఆస్తి కోసం… ఆరుగురిని హతమార్చాడు

- Advertisement -
- Advertisement -

స్నేహితుడి కుటుంబాన్నే మట్టుబెట్టాడు
15 రోజుల్లోనే ఆరుగురిని చంపిన కిరాతకుడు

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని కాజేయడానికి యత్నించి కుటుంబాన్ని తమ్ముడితో కలిసి మట్టుబెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌లో వెలుగుచూజింది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని పదిహేను రోజల్లోనే అత్యంత పాశవికంగా హత్య చేసి ఒక్కొక్క మృతదేహాన్ని ఒక్కో వైపు పడేసి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించిన పోలీసులు వరుస హత్య కేసుల దర్యాప్తులను కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నారు. నిందితులు ఇవికాక ఏవైనా హత్యలకు పాల్పడ్డార అని ఆరా తీస్తున్నారు. సదాశివనగర్ మండలం, గాంధారి రోడ్‌లో సగం కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వరుస హత్య కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెల్లతో కలిసి కామారెడ్డి జిల్లా, మాచారెడ్డికి మకాం మార్చాడు. ప్రసాద్‌కి మాక్లూర్‌లో సొంత ఇల్లు ఉంది. ప్రసాద్ ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి ఆ ఇంటిమీద కన్నేశాడు. ప్రసాద్‌తో స్నేహంగా ఉంటూనే, అతని కుటుంబం మొత్తాన్ని మట్టుబెడితేనే ఆ ఇల్లు తన సొంతం అవుతుందని కుట్ర పన్నాడు. తన తమ్ముడితో కలిసి ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ ఇంటి విషయంలో మాట్లాడాల్సి ఉందని చెప్పి ప్రసాద్‌ను సదాశివనగర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ప్రసాద్ సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో ఉన్నాడని నమ్మించి ఆయన భార్యను మాచారెడ్డి నుంచి తీసుకెళ్లి సదాశివనగర్ దగ్గర గల అటవీ ప్రాంతంలో హత్య చేసి బాసర గోదావరిలో విసిరేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ప్రసాద్ ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు చెల్లెళ్లను సైతం అతి కిరాతకంగా హత్య చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News