Monday, April 29, 2024

సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -
Special Trains for Sankranthi Festival
9వ తేదీ నుంచి 31 వరకు విశాఖ టు లింగంపల్లిల మధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లు

హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో లింగంపల్లి నుంచి విశాఖకు, విశాఖ నుంచి లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈనెల 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖ- టు లింగంపల్లి మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లను, ఈనెల 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు లింగంపల్లి- టు విశాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. సికింద్రాబాద్- టు ధనపూర్, పూరి-యశ్వంత్‌పూర్ రైళ్లు ఈ నెల 6 నుంచి మార్చి 31 వరకు ప్రతి రోజు రాకపోకలు సాగించనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వరకు ఈ నెల 8తేదీ నుంచి 16వ తేదీ వరకు (నంబర్ 07026) రైలు రాకపోకలు సాగిస్తుందని, తిరుగు ప్రయాణంలో (రైలు నం.07025) 17వ తేదీ వరకు నడుస్తుందని రైల్వే శాఖ తెలిపింది. సంక్రాంతికి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎపికి జనం క్యూ కడతారు. దీంతో ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News