Monday, April 29, 2024

కంటైన్‌మెంట్లలో కఠినం

- Advertisement -
- Advertisement -

Containment areas

 

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి
అవసరమైతే రహదారులన్నీ మూసివేత
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు
నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి
రాబోయే 10 రోజులు కీలకం
వైరస్ నివారణ చర్యలపై మంత్రులు
కెటిఆర్, ఈటల రాజేందర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని మం త్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్ ఆదేశించారు. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం బేగంపటలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్‌లు చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి, మేయర్ బొం తు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రి న్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, ఆరోగ్య శాఖ సెక్రెటరీ శాంతికుమారితో పాటు మెడికల్, పోలీస్, జిహెచ్ ఎంసి జోనల్ అధికారులతో కరోనా నివారణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ను కేంద్రం మే నెల 3వ తేదీ వరకు పొడగించిన నేపథ్యం లో ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకుల పంపిణీ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.

కరో నా వైరస్ నివారణకు ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం ఒక్క టే పరిష్కారమార్గమని అన్నారు. ము ఖ్యంగా హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో 100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించే విధంగా సం బంధిత అధికారులు పకడ్బంది చర్య లు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూ చించారు. అవసరమైతే అన్ని రహదారులను మూసివేసి అయినా సరే నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజల అవసరాల నిమిత్తం ఒక మార్గామాన్ని మాత్రమే పోలీసు లు పహారాలో తెరచి ఉంచాలన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఏ ఒక్కరు బైటికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశా రు. ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను ఇంటికే పంపించే ఏర్పా ట్లు చేయాలన్నారు. సభలు, సమావేశాలు అటువంటి సామూహిక పంపి ణీ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో చేపట్టారదన్నారు.

ఎవరైనా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అనుకుంటే పోలీస్ శాఖ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకుని, అనుమానితులను హాస్పిటల్ కు తరలించాలన్నారు. అలాగే వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించి పాజిటివ్ రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించడంతో పాటు ట్రావెల్ హిస్టరీ వివరాలు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఇందులో పోలీస్, జిహెచ్‌ఎంసి,మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైనే రావొద్దని, వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో గుర్తించిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, అవసరమైన అంబులన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే అటువంటి అనుమానితులను ఆసుపత్రికి పంపించాలని, అనుమానితులు నుండి శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తదనంతరం చీఫ్ సెక్రెటరీ సోమేషకుమార్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో పోలీస్, మెడికల్ మరియు మున్సిపల్ అధికారులతో, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనుమనితులను క్వారంటీన్ చేయడం, లేదా హాస్పిటల్స్‌కు పంపడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందన్నారు. ఎవరైనా, ఎవరికైనా అనుమానితులు లేదా వైద్య సేవలు కావాలంటే 104 లేదా జిహెచ్‌ఎంసిలోని 040…. 21111111 నెంబర్ కి కాల్ చేయాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో సిపిలు అంజనీకుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, డైరెక్టర్ మెడికల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Strict actions In Containment areas
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News