అహ్మదాబాద్: పదో తరగతి పరీక్షలో జవాబులు చూపించలేదని పక్క విద్యార్థిపై మరో విద్యార్థితో కత్తితో దాడి చేసిన సంఘటన గుజరాత్లోని క్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నికోల్ ప్రాంతంలో ఓ విద్యార్థి పది గంటలకు ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. ఎగ్జామ్ మధ్యలో పక్కనున్న మరో విద్యార్థి రాసిన జవాబు పత్రం కావాలని డిమాండ్ చేశాడు. తాను రాసిన పత్రాన్ని ఇవ్వను అని చెప్పేశాడు. పరీక్ష ముగిసిన తరువాత సదరు విద్యార్థి ఖోడియార్ మాతా దేవాలయం వద్ద నిలిచి ఉన్నాడు. జవాబు పత్రం అడిగిన విద్యార్థి అక్కడికి చేరుకొని ఆ విద్యార్థి చెంప చెళ్లుమనిపించాడు. జేబులో నుంచి కత్తి తీసు దాడి చేస్తుండగా సదరు విద్యార్థి తప్పించుకున్నాడు. ఇంటికెళ్లి జరిగిన విషయం తన తండ్రికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిపై దాడి చేసిన మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కు తరలించినట్టు సమాచారం.