Friday, April 26, 2024

ఇన్‌స్పెక్టర్‌ను కాల్చి చంపి ఎస్‌ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Sub-inspector shot at another CRPF inspector

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సిఆర్పీఎఫ్ 122వ బెటాలియన్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ ఎస్‌ఐ,  ఇన్‌స్పెక్టర్‌ను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లోధి ఎస్టేట్ లోని హోంమంత్రి భవనం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దశరథ్ సింగ్, ఎస్‌ఐ కర్నేల్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మాటామాటా పెరిగి ఆగ్రహంతో ఇన్‌స్పెక్టర్ పై ఎస్‌ఐ కాల్పులు జరిపాడు. తూటా తగలడంతో ఇన్‌స్పెక్టర్‌ దశరథ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఎస్‌ఐ కర్నేల్ సింగ్ తుపాకీతో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sub-inspector shot at another CRPF inspector

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News