Monday, April 29, 2024

అయోధ్య టెలీ ప్రసారాలు అడ్డుకోవద్దు: తమిళనాడుకు సుప్రీం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమిళనాడులో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల ప్రసారాలను అడ్డుకోవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్టప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. అయోధ్యలో జరిగే పవిత్రోత్సవాలను తమిళనాడు లోని దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ జనవరి 20 నాటి మౌఖిక ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది.

ఇప్పటికే తిరస్కరించిన వాటికి సంబంధించి పక్కా కారణాలను చూపాలని, డేటాను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆలయాల్లో పూజలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలియజేసింది. అయోధ్య కార్యక్రమాల ప్రత్యక్షప్రసారం చేయడంపై నిషేధం విధించలేదని, అది కేవలం రాజకీయ ప్రేరేపితమని తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ వివరించారు ఈ క్రమంలో జనవరి 29లోగా ఈ పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వ స్పందనను ధర్మాసనం కోరింది. తమిళనాడు ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్‌ను నిషేధించిందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోపించారు.

రామాలయాల్లో భజనలు, పూజలను కూడా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆదివారం రాజకీయ దుమారం రేగింది. ఆలయాల్లో రాముడి పూజలు నిర్వహించడంపై హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ ఎలాంటి నిషేధం విధించలేదని తమిళనాడు హిందూమత ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ఆదివారం స్పష్టం చేశారు. ఈ వివాదంపై బీజేపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పీ సెల్వం తరఫున న్యాయవాది జి. బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News