Thursday, May 9, 2024

సుశీల్‌కుమార్ మోడీ రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Sushilkumar Modi unanimously elected to Rajya Sabha

 

పాట్నా: బిజెపి సీనియర్ నేత సుశీల్‌కుమార్‌మోడీ బీహార్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్‌జెపి వ్యవస్థాపకుడు రామ్‌విలాస్‌పాస్వాన్ మృతి చెందడంతో బీహార్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో సుశీల్‌కుమార్‌కు పోటీలో ఎవరూ లేనందున ఆయన ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. శ్యామ్‌నందన్‌ప్రసాద్ అనే వ్యక్తి వేసిన నామినేషన్ స్క్రూట్నీలోనే తిరస్కరణకు గురైంది. కనీసం 10మంది ఎంఎల్‌ఎలు మద్దతు తెలుపుతున్నట్టు నామినేషన్ పత్రాల్లో చూపడంలో ప్రసాద్ విఫలమైనందున తిరస్కరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. సుశీల్‌కుమార్ గత బీహార్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News