- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.. పలు ఆర్టీసి సంఘాలు తమ మద్దతును తెలుపుతున్నాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఎస్డబ్ల్యూఎస్ ప్రధాన కార్యదర్శి వీఎస్రావులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. డిపోల ముందు నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. మిగిలిన యూనియన్లు విధుల్లో పాల్గొంటూనే నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించాయి.
- Advertisement -