Thursday, May 16, 2024

ఏఐజీ ఆస్పత్రిలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల అనంతరం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి సూచనల మేరకు ఆయన గురువారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత.. వైద్యుల సూచనల మేరకు గురువారం సాయంత్రం చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో చేరారు.

AIG-Hospitals

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News