Monday, April 29, 2024

కుప్పంలో ఉద్రిక్తత.. టిడిపి నేతల గృహనిర్బంధం

- Advertisement -
- Advertisement -

TDP leaders house arrest at Chittoor district

అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి పోటాపోటీ పాదయాత్రలు, ర్యాలీలతో ఆందోళనలు నెలకొన్నాయి. హంద్రీనీవా సాధన కోసం టిడిపి మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లపట్టాలపై టిడిపి కోర్టుకెళ్లడాన్ని నిరసిస్తూ వైసిపి భారీ ర్యాలీ చేపట్టారు. పోటాపోటీగా ఆందోళ కార్యక్రమాలు నిర్వహిస్తుండంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకొచ్చారు. టిడిపి మహా పాదయాత్రకు వెళ్లకుండా పలువురు నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. పలమనేరులో మాజీమంత్రి అమర్ నాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి వైసిపి కార్యకర్తలు బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఎక్కడికక్కడ వైసిపి బైక్ ర్యాలీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రామకుప్పంలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు.

TDP leaders house arrest at Chittoor district

TDP leaders house arrest at Chittoor district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News