Wednesday, May 8, 2024

నాలుగో టెస్టు: ఇండియా 191 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

Team India scored 191 runs in Ind vs eng

కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 61.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. శార్ధూల్ టాకూర్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఏడో వికెట్ పై శార్ధూల్ టాకూర్- ఉమేష్ యాదవ్ 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శార్థూల్ టాకూర్ 57 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 50 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్ లో బయిర్ స్ట్రోకు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు. రోహిత్ శర్మ 11 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బైస్ట్రోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ 17 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ఛటేశ్వరా పుజారా నాలుగు పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో బైస్ట్రోకు క్యాచ్ మైదానం వీడాడు. రవీంద్ర జడేజా పది పరుగులు చేసి క్రిష్ వోక్స్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా రాబీన్ సన్ మూడు వికెట్లు, అండర్సన్, ఓవర్టన్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News