Friday, May 17, 2024

గిల్ ఔట్…. టీమిండియా 260/3

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 260 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి అబాట్ బౌలింగ్‌లో మ్యాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రెండో వికెట్‌పై గిల్, అయ్యర్ కలిసి 200 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ఇసాన్ కిషన్(07), కె ఎల్ రాహుల్(28) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: ప్రగతి భవన్ వైపు దూసుకొచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News