Monday, April 29, 2024

అసెంబ్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 11 గంటల నుంచి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ. 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల అధికారులను ఆదేశించింది.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News