హైదరాబాద్: చినజీయర్స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లిన సిఎం.. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్స్వామిని ఆహ్వానించారు. సిఎం కెసిఆర్తో పాటు మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపి జోగినపల్లి సంతోష్లు ఉన్నారు.
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కెసిఆర్ అక్కడ యాగాలు చేయనున్నారు. ఈ నెల 29న ఆయన ఏకకాలంలో యాగాలు చేయనున్నట్లుగా సమాచారం. శుక్రవారం ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో కెసిఆర్ పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో చండీయాగం, సుదర్శనయాగం, గంగమ్మ పూజలు చేస్తారు. చండీయాగం పూర్ణాహుతిలో కెసిఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ను కెసిఆర్ దంపతులు ప్రారంభిస్తారు.