Monday, May 6, 2024

24 గంటల్లో 2479 పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

2924 new covid 19 cases reported in telangana

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. మంగళవారం ఒక్క రోజే 2479 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1,47,642కు చేరుకోగా 916 మంది చనిపోయారు. కరోనా నుంచి 1,15,072 మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 31654 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 2485 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఒక్క రోజే 62649 మంది కరోనా పరీక్షలు చేయగా మొత్తం పరీక్షల సంఖ్య 18,90,554కు చేరుకుంది. కరోనా పాజిటివ్ జిల్లాల వారిగా హైదరాబాద్(322), రంగారెడ్డి(188), మేడ్చల్(183), వరంగల్‌ అర్బన్‌ (124), కరీంనగర్‌ (120), నల్గొండ(108), నిజామాబాద్‌ (101) నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News