- Advertisement -
హైదరాబాద్: నగర పరిధిలోని రెవెన్యూ అధికారులపై తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తుల సర్వే మందకొడిగా సాగడంపై సిఎస్ మండిపడ్డారు. ఆస్తుల ఆన్ లైన్ నమోదును నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ స్థాయి అధికారులైనా విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆస్తుల సర్వే మందకొడిగా జరుగుతున్న ప్రాంతాల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ, వ్యయసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతన్న సంగతి తెలిసిందే.
Telangana CS Somesh Kumar fires on revenue officers
- Advertisement -