Friday, May 10, 2024

కెసిఆర్‌తోనే తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి: బాలరాజు

- Advertisement -
- Advertisement -

MLA balaraju

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ రైతుల కోసమే ఉందని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బాలరాజు తెలిపారు. శాసన సభలో బడ్జెట్‌పై రెండో రోజు చర్చ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్ ఉందని కొనియాడారు. పాలమూరు జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారని ప్రశంసించారు. దక్షత కలిగిన కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని బాలరాజు స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ నిరంతర కృషి వల్ల తెలంగాణ ఖ్యాతి దశదిశలా వ్యాపించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా గ్రామీణ ముఖ్య చిత్రాన్ని మార్చేశాయని మెచ్చుకున్నారు. రైతు బంధును కెసిఆర్ రైతు బంధుగా పేరు మార్చాలని తాను కూడా ప్రతిపాదిస్తున్నానన్నారు.

 

Telangana more development with KCR says balaraju

 

Telangana more development with KCR says balaraju, Telangana budget is former budget and Kaleshwaram Project completed with in three Years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News