Monday, April 29, 2024

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణలో మరో 6 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1… నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ తెలంగాణలో ఆరు కేసులు వెలుగు చూశాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన వాటిలో హైదరాబాద్ లో నాలుగు, మెదక్, రంగారెడ్డిలో ఒక్కో కరోనా కేసులు బయటపడ్డాయి. జినోమ్ సీక్వెన్స్ కోసం ఈ నమూనాలను పుణెకు పంపించారు.

కరోనా కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పదేళ్లలోపు పిల్లలు, మహిళలు, వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News