మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన గోరటి వెంకన్న, దయానంద్, బస్వరాజు సారయ్యలు బుధవారం శాసనమండలిలో చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముగ్గురు శాసనసభ్యులకు పుష్పగుచ్ఛం ఇచ్చి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సభసంప్రదాయాలను గౌరవిస్తూ ప్రమాణం చేసిన విధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ,వేముల ప్రశాంత్ రెడ్డి,చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,డిప్యూటీ చైర్మన్ వేతి విద్యాసాగర్రావు, శాసనసభ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు,ఎంఎల్సిలు దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, ఫరూక్ హుస్సేన్సపోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యుడు బిగాల గణేష్గుప్తా, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.