- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఐసెట్ షెడ్యూల్ 2020ను కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ ప్రొ.రాజిరెడ్డి, రిజిస్టార్ పురుషోత్తంలు శుక్రవారం విడుదల చేశారు. ఈనెల 9 నుండి ఆన్లైన్ విధానంలో 30వరకు దరఖాస్తుల సమర్పణకు తుది గడువుగా ఉందన్నారు. రూ.500 ల అపరాధ రుసుంతో మే 14 వరకు, రూ.5వేల అపరాధ రుసుంతో మే 16 వరకు దరఖాస్తులకు గడువు ఉందని వివరించారు. రాష్ట్రంలో 10 పరీక్ష కేంద్రాలను, ఏపిలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఈ సారి ఐసెట్ ప్రవేశ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష మే20వ తేదీ ఉదయం 10గంటల నుండి 12:30 గంటల వరకు, మే21వ తేదీ ఉదయం మాత్రమే పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
The release of the TS ICET 2020 schedule
- Advertisement -