మాస్కో : కొవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడంలో 92 శాతం ప్రభావంతంగా ఉందని రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ బుధవారం వెల్లడించింది. భారీ ఎత్తున ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న ఈ ట్రయల్స్ రెండవసారి ప్రచురించ వలసి ఉంది. సెప్టెంబర్లో భారీ ఎత్తున ట్రయల్స్ చేపట్టేముందు దీనికి అనుమతి లభించినప్పటికీ మొట్టమొదటి వ్యాక్సిన్ను ప్రజా వినియోగం కోసం తామే ముందు అందిస్తున్నామని ప్రకటిస్తూ ఆగస్టులో దీన్ని రిజిస్టర్ చేసింది. మొదటి ట్రయల్ 16, 000 మందిపై నిర్వహించిన తరువాత దాని ఆధారంగా రెండు డోస్లకు సంబంధించి మధ్యంతర ఫలితాలు వెల్లడయ్యాయి. దీనికి ఆర్థికంగా రష్యా డైరెక్టు ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ అండ్ (ఆర్డిఐఎఫ్) సహకరిస్తోంది. మార్కెటింగ్ బాధ్యతలు కూడా తీసుకుంది. గమలెయా ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ మూడోట్రయల్ మాస్కో లోని 29 క్లినిక్ల్లో నిర్వహిస్తున్నారు. 40 వేల మంది వాలంటీర్లను ఇందులో చేర్చారు.