Saturday, April 27, 2024

కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో చోరీ

- Advertisement -
- Advertisement -

మాక్లూర్: మాణిక్‌బండార్ వద్దగల కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గుర్తు తెలియని దొంగలుపడి 7లక్షల 50వేల రూపాయలు అపహరించినటుల ఎస్‌ఐ యాదగిరి గౌడ్ తెలిపారు. ఈసంఘటన వివరాలిలాఉన్నాయి.కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తమ సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు బుధవారం 7లక్షల 50వేలు తీసుకురాగా గురువారం చెల్లించాలని డబ్బులు కళాశాలలోని గదిలో బీరువాలో పెట్టారు.

కాగ అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు కళాశాల వెనకభాగం నుంచి గదిలోకి ప్రవేశించి బీరువా బద్దలు కొట్టి అందులోనుంచి జీతాల డబ్బు మొత్తం 7.50లక్షలు దొంగలించారని, గురువారం ఉదయం కళాశాలకు వచ్చిన సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే మాక్లూర్ ఎస్‌ఐ యాదగిరిగౌడ్ సిబ్బందితో కలిసి కళాశాలకు చేరుకొని విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కళాశాలలో చోరీ జరిగిన ప్రాంతాన్ని ఎసిపి కిరణ్‌కుమార్ మాక్లూర్ ఎస్‌ఐ యాదగిరిగౌడ్, రూరల్ ఎస్‌ఐ లింబాద్రితో పాటు ఐడి పార్టీ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News