- Advertisement -
బరంపురం (ఒడిశా) : ఒడిశా గంజాం జిల్లా ఖైరచాతా గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డికుప్పకు మంటలు అంటుకోడంతో సమీపాన గల నలుగురు పిల్లల్లో ముగ్గురు తీవ్ర గాయాల పాలై మృతి చెందారు. సాయిరాం జానీ, దీపక్ గౌడ, ఇటిశ్రీ జెనా అనే ఈ పిల్లలు పదేళ్ల లోపు వారు. నాలుగో పిల్లవాడు అలోక్ జెనాకు బరంపురం లోని ఎంఎసిజి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. మృతులు ముగ్గురిలో ఇద్దరు బాలురు కాగా, ఒకరు బాలిక. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ సంతాపం తెలుపుతూ ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించారు.
Three children killed in straw fires
- Advertisement -