Saturday, April 27, 2024

ఛత్తీస్‌ఘడ్‌ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌ఘడ్: మరోసారి ఎదురు కాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధి లోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు పోలీసుల నుంచి తప్పించుకుని అటవీ ప్రాంతం లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News