Saturday, April 27, 2024

పేలిన కారు టైరు: ముగ్గురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

Three Members dead in Car accident in AP

 

అమరావతి: అతి వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో లారీ ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవదహనమైన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కారు ప్రకాశం జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్నప్పుడు కారు టైరు పేలింది. లారీ ఢీకొట్టడంతో కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారు క్షణాల్లో కాలిపోవడంలో అందులో ఉన్న ముగ్గురు సజీవదహనమయ్యారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. సిఐ అంజనేయులు, ఎస్‌ఐ సుమన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన రావూరి తేజ(35)గా గుర్తించారు. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News