- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని శ్రీనగరం ప్రాంతం జడిబాల్లో ఆదివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జడిబాల్లో దాక్కున్నారని సమాచారం రావడంతో సిఆర్పిఎఫ్ కు చెందిన 115, 28వ బెటాలియన్ కార్డెన్ సెర్చ్ చేపట్టింది. భద్రతా బలగాలు కదలికలు గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటాన స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -