Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 477 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

477 New Corona cases in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కేసులు రోజురోజుకూ రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 477మందికి కొత్తగా కోవిడ్-19 పాజిటివ్, ఐదుగురు మృతి చెందినట్టు ఎపి వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,929 చేరింది. మృతుల సంఖ్య 106 పెరిగింది. తాజాగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు, చిత్తూరులో ఒక్కొక్కరు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఎపికి చెందినవారు 439 ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మందికి, నలుగురువిదేశీయులకు కరోనా వైరస్ సోకింది. ఎపిలో కరోనాతో ఇప్పటివరకు 4,307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 4,156 యాక్టివ్ కేసులున్నాయి.

477 New Corona cases in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News