వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడిని నిష్టతో పూజించడంలో సామాన్యులతో పాటు సినీ తారలు కూడా ఎంతో ముందుంటారు. ఏడాది మొత్తం ఎలాంటి విఘ్నాలు కలగకుండా అనుకున్నవన్నీ సవ్యంగా సాగాలని గణపయ్య ముందు మోకరిల్లి మరీ మొక్కుతారు. వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది కూడా పలువురు సినీ తారలు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు. మెగాస్టార్ చిరంజీవితో సహా ఫ్యామిలీ హీరోలంతా వినాయకుడిని పూజించి ఆశీస్సులు అందుకున్నారు. ఈసారి చిరంజీవి బర్త్ డే, వినాయక చవితి ఒకేరోజు కలిసి రావడం విశేషం.
మెగా దంపతులు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూపర్ స్టార్ మహేష్బాబు, నమ్రత దంపతులు, పిల్లలు గౌతమ్, సితారలు తమ ఇంట్లో పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. అదేవిధంగా మోహన్బాబు, మంచు విష్ణు, నాని, నితిన్, శర్వానంద్, వరుణ్ సందేశ్ తదితరులు పండుగ వేడుకలను నిర్వహించారు. హీరోయిన్లు కంగనా రనౌత్, రాశీఖన్నా, నిధి అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు తమ ఇళ్లలో వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
Tollywood Stars Celebrate Vinayaka Chaturthi 2020