Monday, April 29, 2024

భారత్ జోడో యాత్రకు ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions for Bharat Jodo Yatra

సైబరాబాద్‌లో వచ్చే నెల 2న ప్రవేశించనున్న యాత్ర
ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
నవంబర్ 1వ తేదీన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను తొండపల్లి టోల్‌గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్డు, రాళ్లగూడ జంక్షన్, ఎయిర్ పోర్టు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, రైట్ టర్న్, ఓఆర్‌ఆర్ అండర్‌పాస్, సింపులెక్స్ జంక్షన్, లెఫ్ట్ టర్న్ తీసుకుని సాతమరాయ్ , గగన్‌పహాడ్ నుంచి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ లిమిట్స్‌లోకి ఎంటర్.
బాలనగర్ ట్రాఫిక్ పిఎస్‌లో ఈ నెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి కూటకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
బోయిన్‌పల్లి నుంచి బాలానగర్ వచ్చే వాహనాలను బోయన్‌పల్లి జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతం నగర్, శోభనా జంక్షన్ లేదా ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డు.
బోయిన్‌పల్లి నుంచి బాలానగర్ నుంచి వచ్చే వాహనాలను ఫేరోజ్‌గూడ జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డు, గౌతం నగర్, శోభన జంక్షన్ వైపు మళ్లిస్తారు.
బోయిన్‌పల్లి నుంచి కూకట్‌పల్లి వచ్చే వాహనాలు బాలానగర్ ఫ్లైఓవర్, ఐడిపిఎల్ హట్స్, కూకట్‌పల్లి వై జంక్షన్.
బోయిన్‌పల్లి నుంచి కూకట్‌పల్లి వచ్చే వాహనాలను బలానగర్ టి జంక్షన్, ఫతేనగర్ పైప్‌నగర్ రోడ్డు, జింకలవాడ, సనత్‌నగర్ రైల్వే స్టేషన్, భరత్‌నగర్ మార్కెట్, హైదరాబాద్ టీ హౌస్,కూకట్‌పల్లి వై జంక్షన్.
బోయిన్‌పల్లి, జీడిమెట్ల మీదుగా కూకట్‌పల్లి నుంచి నర్సాపూర్ జంక్షన్ లెఫ్ట్ టర్న్, జింకలవాడ, సనత్‌నగర్ రైల్వే స్టేషన్, భరత్‌నగర్ మార్కెట్, హైదరాబాద్ టీ హౌస్, కూకట్‌పల్లి వై జంక్షన్.
కూకట్‌పల్లి మీదుగా బోయిన్‌పల్లి వచ్చే వాహనాలను నర్సాపూర్ జంక్షన్, లెఫ్ట్ టర్న్, గుడెన్‌మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, కుత్బుల్లార్ విలేజ్, సుచిత్ర జంక్షన్ నుంచి రైట్న్ తీసుకుని బోయిన్‌పల్లి వైపు మళ్లాలి.
కూకట్‌పల్లి ట్రాఫిక్ పిఎస్…
నవంబర్ 2వ తేదీన ఉదయం 6.30 నుంచి 8.30 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
బాలానగర్ మీదుగా అంబేద్కర్ వై జంక్షన్‌వచ్చే వాహనాలను వన్ లేన్‌లో పంపిస్తారు.
మూసాపేట నుంచి ఇక్రిశాట్ నుంచి ఎన్‌హెచ్ 65 రోడ్డు రెండు లేన్ల అంబేద్కర్ వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కెపిహెచ్‌బి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే నెల 2వ తేదీన ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆంక్షలు విధించారు.
కూకట్‌పల్లి నుంచి ఇక్రిశాట్ నుంచి వచ్చే వాహనాలను రెండు లేన్లను ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News